సూపర్ స్టార్ రజనీకాంత్ – మాస్ మాస్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న “కూలీ” సినిమాపై ఓ స్పెషల్ క్రేజ్ నడుస్తోంది. ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటినుంచి రోజుకో అప్డేట్ తో హైప్ పెంచుతూనే ఉంది. కానీ, ఇప్పుడు మీరు వినే అప్డేట్ మాత్రం షాక్ ఇచ్చేదే. అందరూ ఎదురు చూస్తున్న ట్రైలర్ని పూర్తిగా స్కిప్ చేస్తూ, సినిమా థియేటర్లలోకి రావడం ప్లాన్ చేసారని తెలుస్తోంది. దాంతో ఈ విషయం మీడియాలో భారీగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఇలా చేయడమంటే రిస్క్ కదా? అయితే ఈ ‘స్ట్రాటజిక్ సైలెన్స్’ వెనుక ఉన్న వ్యూహం చూస్తే ఆశ్చర్యపడకుండా ఉండలేరు.
ట్రైలర్ లేదు… కాని బజ్ మోతో మోత!
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, క్యాస్టింగ్ అప్డేట్స్—all together సినిమా మీద బలమైన బజ్ తీసుకువచ్చాయి. ఆపై “కూలీ” బిజినెస్ కూడా దాదాపు పూర్తయిపోవడంతో, ట్రైలర్ అనే టూల్ అవసరం లేదనే కాన్ఫిడెన్స్ టీంలో కనిపిస్తోంది. అసలే మార్కెట్లో రజనీ – లోకేష్ కాంబినేషన్కే ఓ బ్రాండ్ వాల్యూ ఉంది.
కథ బయట పడకూడదు… థియేటర్లోనే షాక్ ఇవ్వాలి!
లోకేష్ స్టైల్ తెలిసినవారికి ఇది పెద్ద విషయం కాదు. ఆయన సినిమాల్లో మల్టీ లేయర్ నరేషన్, సర్ప్రైజ్ ట్విస్టులు కామన్. అలాంటి కథను ట్రైలర్లో రివీల్ చేస్తే, ఆ “ఫస్ట్ టైం థ్రిల్” పోతుంది. అందుకే, ఈసారి ఆ ఎక్స్పీరియన్స్ను పూర్తిగా థియేటర్కి పరిమితం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ట్రైలర్ లేకుండానే బంపర్ బిజినెస్!
“కూలీ” ప్రీ-రిలీజ్ బిజినెస్ నంబర్స్ చూస్తే, ట్రైలర్ అవసరం లేదన్న ధైర్యానికి బేస్ స్పష్టంగా కనిపిస్తుంది:
తమిళనాడు థియేట్రికల్ రైట్స్: ₹65 కోట్లు
తెలుగు రైట్స్: ₹30 కోట్లు
ఓవర్సీస్: ₹45 కోట్లు+
ఓటీటీ హక్కులు: ₹80 కోట్లు పైగా (Netflix, Disney+ పోటీతో)
మ్యూజిక్, బ్రాండ్ డీల్స్: ₹20 కోట్లు (అంచనా)
ఈ లెక్కలే చెబుతున్నాయి – ట్రైలర్ లేనంత మాత్రాన బిజినెస్ మీద ఎటువంటి ప్రభావం లేదని!
ట్రైలర్ లేకపోవడమే USP అవుతుందా?
ఇప్పటి డిజిటల్ యుగంలో, ట్రైలర్లు ఓవర్ ఎక్స్పోజర్కు దారి తీస్తున్నాయనేది ఫిల్మ్ సర్కిల్స్లో వినిపించే వాదన. అలా కాకుండా, థియేటర్లో సర్ప్రైజ్ మోడ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం నిజమైన ఇంటర్నేషనల్ ప్రమోషన్ స్టైల్ అని చెప్పొచ్చు.
రజనీకాంత్ & లోకేష్ కనకరాజ్ “కూలీ” – ట్రైలర్ లేకుండానే థియేటర్లోకి వస్తోంది. ఇది ఓ రిస్క్ అయినా, ఇప్పటి ట్రెండ్ను బద్దలు కొడుతూ కొత్త ప్రచార స్ట్రాటజీని టెస్ట్ చేయనుంది.